Hyderabad: Congress నిరసన ర్యాలీకి పోలీసుల అనుమతి

ABN , First Publish Date - 2022-06-13T17:02:43+05:30 IST

కాంగ్రెస్ (Congress) నిరసన ర్యాలీకి పోలీసులు (Police) అనుమతిచ్చారు.

Hyderabad: Congress నిరసన ర్యాలీకి  పోలీసుల అనుమతి

Hyderabad: కాంగ్రెస్ (Congress) నిరసన ర్యాలీకి  పోలీసులు (Police) అనుమతిచ్చారు. రాకపోకలకు ఆటంకం దృష్ట్యా షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలు నెక్లస్‌రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి.. నిరసన ర్యాలీ ప్రారంభించనున్నారు. ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈడీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ శాంతియుత నిరసన తెలపనుంది. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితోపాటు వెయ్యి మంది కార్యకర్తలు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పోలీసులను కోరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నెక్లెస్రోడ్డుకు భారీగా చేరుకున్నారు. కాగా సోనియా, రాహుల్‌గాంధీకి ఈడీ నోటీసులను నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది.

Updated Date - 2022-06-13T17:02:43+05:30 IST