Secunderabad రైల్వే స్టేషన్ విద్వంసం Case.. పోలీసుల అదుపులో సుబ్బారావు, శివ

ABN , First Publish Date - 2022-06-23T18:19:33+05:30 IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Railway Station) విద్వంసం కేసులో విచారణ కొనసాగుతోంది.

Secunderabad రైల్వే స్టేషన్ విద్వంసం Case.. పోలీసుల అదుపులో సుబ్బారావు, శివ

Hyderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Railway Station) విద్వంసం కేసులో విచారణ  కొనసాగుతోంది. సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన ఆవుల సుబ్బారావు (Subbarao), శివ(Shiva)లను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ రిపోర్టులో సుబ్బారావు, శివల పాత్రపై పోలీసులు ప్రస్తావించారు. హకీంపేట్ సోల్జర్స్ గ్రూప్‌లో ఆందోళనకారులకు మద్దతిస్తున్నామని పోస్టులు పెట్టారని, ఆందోళనకు కావల్సిన లాజిస్టిక్స్ సమకూర్చినట్టు పోలీసులు నిర్ధారించారు. కీలక నిందితులతో సుబ్బారావు ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు. A2 పృధ్విరాజ్ సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్ధి అని, విద్వంసంలో కీలకంగా వ్యవహరించిన పలువురు సాయి డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్స్‌గా నిర్ధారించారు. ఇప్పటివరకు 63మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. 55మందిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. పరారీలో మరో ఎనిమిది మంది ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-06-23T18:19:33+05:30 IST