JP Nadda అధ్యక్షతన Novatelలో సంస్థాగత కార్యదర్శుల సమావేశం
ABN , First Publish Date - 2022-07-04T18:26:25+05:30 IST
జేపీ నడ్డా అధ్యక్షతన సోమవారం నోవాటెల్ హోటల్లో పార్టీ సంస్థాగత కార్యదర్శుల సమావేశం జరుగుతోంది.
హైదరాబాద్ (Hyderabad): బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) అధ్యక్షతన సోమవారం నోవాటెల్ (Novatel) హోటల్లో పార్టీ సంస్థాగత కార్యదర్శుల సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, అన్ని రాష్ట్రాల సంస్థాగత ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చిస్తున్నట్లు సమాచారం. సౌత్ ఇండియా ఫోకస్గా కార్యచరణ తీసుకునేందుకు బీజేపీ సిద్దమవుతోంది. ముఖ్యంగా తెలంగాణపై ఫోకస్ పెంచాలని నిర్ణయించింది. ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్ రోడ్డు మ్యాప్పై ఈ కార్యక్రమంలో చర్చిస్తున్నట్లు సమాచారం.