సీసీ కెమెరాకు చిక్కిన సింగరేణి కాలనీ నిందితుడు

ABN , First Publish Date - 2021-09-14T20:33:42+05:30 IST

హైదరాబాద్: సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడి సీసీ టీవీ దృశ్యాలు లభించాయి.

సీసీ కెమెరాకు చిక్కిన సింగరేణి కాలనీ నిందితుడు

హైదరాబాద్: సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడి సీసీ టీవీ దృశ్యాలు లభించాయి. నిందితుడు రాజు కోసం వందమంది పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఘటన జరిగిన రోజు సాయంత్రం ఎల్బీనగర్ వద్ద మరో స్నేహితుడితో కలిసి మద్యం తాగాడు. ఆ తర్వాత బయటకు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు ఎల్బీనగర్ వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే రాజు స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు రాజు చేసిన నేరం తెలియదన్నాడు. మద్యం తాగిన తర్వాత రాజు ఎటు వెళ్లాడో తనకు తెలియదని చెప్పాడు.


గతంలో నిందితుడు రాజుపై బైక్ దొంగతనం కేసు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి ప్రవర్తన నచ్చక భార్య వదిలేసి వెళ్లిపోయిందని పోలీసుల విచారణలో తేలింది. నల్గొండ జిల్లాలో ఉన్న రాజు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2021-09-14T20:33:42+05:30 IST