గణేష్ నిమజ్జనానికి సుప్రీం అనుమతితో హైదరాబాద్లో సంబరాలు
ABN , First Publish Date - 2021-09-16T19:00:05+05:30 IST
హుస్సేన్సాగర్ గణేశ్ నిమజ్జనానికి సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వడంతో భాగ్యనగరంలో సంబరాలు జరిగాయి.
హైదరాబాద్: హుస్సేన్సాగర్ గణేశ్ నిమజ్జనానికి సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వడంతో భాగ్యనగరంలో సంబరాలు జరిగాయి. ఎంజే మార్కెట్ వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి టపాసులు కాలుస్తూ, స్వీట్లు పంచారు. భక్తుల మనోభావాలను గౌరవించి అనుమతులు ఇచ్చిన సుప్రీం కోర్టుకు భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి కృతజ్ఞతలు తెలియజేసింది.