కస్టమ్స్ విభాగంలో సీబీఐకి చిక్కిన లంచాధికారులు
ABN , First Publish Date - 2021-10-26T20:19:35+05:30 IST
హైదరాబాద్: కస్టమ్స్ విభాగంలో లంచాధికారులు సీబీఐకి చిక్కారు.
హైదరాబాద్: కస్టమ్స్ విభాగంలో లంచాధికారులు సీబీఐకి చిక్కారు. బషీర్బాగ్ జీఎస్టీ భవన్లో సీబీఐ మెరుపు దాడులు చేసింది. ఇద్దరు అధికారులు సీబీఐకు అడ్డంగా దొరికిపోయారు. కస్టమ్స్ అండ్ యాంటీ విజన్ వింగ్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సురేష్ కుమార్, ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కిషన్ పాల్ సీబీఐ దాడుల్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. బిల్స్ మెంటినెన్స్ చేయని షాపులు, పలు కంపెనీలు తనిఖీలు చేసిన ఈ ఇద్దరు అధికారులు లంచాలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై పలువురు బాధితుల ఫిర్యాదుల ఆధారంగా సీబీఐ సోదాలు చేపట్టింది. దొరికిన ఇద్దరు అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలపై సీబీఐ అధికారులు కూపీ లాగుతున్నారు.