గంజాయి మత్తులో లోహియానగర్‌ యువత

ABN , First Publish Date - 2021-11-17T16:53:50+05:30 IST

అడ్డగుట్ట లోహియానగర్‌ బస్తీలో యువత గంజాయి మత్తులో ఉంటోందని, విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు కోరారు. ఈ మేరకు పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎస్సీ విభాగం

గంజాయి మత్తులో లోహియానగర్‌ యువత

హైదరాబాద్/అడ్డగుట్ట: అడ్డగుట్ట లోహియానగర్‌ బస్తీలో యువత గంజాయి మత్తులో ఉంటోందని, విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు కోరారు. ఈ మేరకు పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎస్సీ విభాగం అధ్యక్షుడు అచ్యుత్‌ రమే్‌షబాబు, సికింద్రాబాద్‌ నియోజకవర్గం ఎస్సీ విభాగం అధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌, కొండూరు సాయిరాం, బాకీ ప్రవీణ్‌, అరుణ్‌ తుకారాంగేట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎల్లప్పను కలిసి వినతిపత్రం అందజేశారు. సీపీ అంజనీకుమార్‌కు కూడా వినతిపత్రం ఇచ్చామని వారు తెలిపారు. అడ్డగుట్ట, ఈస్ట్‌మారేడ్‌పల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న సమాచారం పోలీసులకు తెలియకపోవడం విచారకరమన్నారు. స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి గంజాయి విక్రయిస్తున్న వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2021-11-17T16:53:50+05:30 IST