Hyderabad: భార్యాపిల్లలు కనిపించలేదని ఇంట్లోని వస్తువులకు నిప్పు
ABN , First Publish Date - 2021-12-01T17:45:15+05:30 IST
మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తకు భార్యాపిల్లలు కనిపించలేదు. కోపంతో అతను ఇంట్లోని వస్తువులను తగులబెట్టాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ సర్కిల్ ఎంఎం పహాడి ఇమాద్నగర్లో
హైదరాబాద్/రాజేంద్రనగర్: మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తకు భార్యాపిల్లలు కనిపించలేదు. కోపంతో అతను ఇంట్లోని వస్తువులను తగులబెట్టాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ సర్కిల్ ఎంఎం పహాడి ఇమాద్నగర్లో సోమవారం రాత్రి జరిగింది. ఇమాద్నగర్కు చెందిన షేక్ మస్తాన్, సమీరా బార్యాభర్తలు. వీరికి నలుగురు సంతానం. ఇమాద్నగర్లోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. మంగళవారం ఉదయం భార్యాభర్త గొడవ పడ్డారు. పిల్లలకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో సమీరా వారిని తీసుకుని సోమవారం సాయంత్రం ఎంఎం పహాడిలోని తల్లి వద్దకు వెళ్లింది. రాత్రి మద్యం తాగొచ్చిన షేక్ మస్తాన్కు భార్యాపిల్లలు ఇంటి వద్ద కనిపించలేదు. కోపంతో ఇంట్లోని వస్తువులను, రిఫ్రిజిరేటర్, టెలివిజన్ను తగులబెట్టాడు. విషయం తెలిసిన భార్య సమీరా మంగళవారం ఉదయం అత్తాపూర్ ఔట్పోస్ట్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేసింది. తన భర్త తనతో గొడవ పడి ఇంటిని తగులబెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.