మేడ్చల్: అర్థరాత్రి రోడ్డు ప్రమాదం....

ABN , First Publish Date - 2022-01-21T16:09:34+05:30 IST

మేడ్చల్‌లో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా...

మేడ్చల్: అర్థరాత్రి రోడ్డు ప్రమాదం....

హైదరాబాద్: మేడ్చల్‌లో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. దంపతులు భార్య రేష్మా భేగం‌, భర్త సయ్యద్ సలీం గండిమైసమ్మ నుంచి  మేడ్చల్ వైపు పల్సర్‌ బైక్‌పై (TS10EF9248) వస్తున్నారు. సుతారిగూడ చెరువు వద్ద అతి వేగంగా వస్తున్న అశోకా లేలాండ్ వాహనం (AP 28 TD1968) బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరూ తీవ్రంగా గాయడ్డారు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రేష్మా భేగం మృతి చెందగా.. సయ్యద్ సలీం చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అశోకా లేలాండ్ వాహనం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలియవచ్చింది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-01-21T16:09:34+05:30 IST