మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి: డా. రాజారావు

ABN , First Publish Date - 2022-03-23T16:34:27+05:30 IST

సికింద్రాబాద్‎, బోయిగూడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతదేహాలు...

మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి: డా. రాజారావు

హైదరాబాద్: సికింద్రాబాద్‎, బోయిగూడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతదేహాలు అన్ని పూర్తిగా కాలిపోయాయని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన మృత దేహాలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. ఇలాంటి ఘటనలో పొగతోనే ముందుగా మరణిస్తారని, పొగ వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్తారన్నారు. మృతదేహాలను గుర్తించిన అనంతరం పోస్ట్ మార్టం నిర్వహిస్తామని డాక్టర్ రాజారావు తెలిపారు.


సికింద్రాబాద్‎లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బోయిగూడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్‎తో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గోదాంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే.. ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్న 11 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ప్రమాదం నుంచి ఒక కార్మికుడు మాత్రమే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు.

Updated Date - 2022-03-23T16:34:27+05:30 IST