Makkah లో విషాద ఘటన.. భవనంపై నుంచి పడి హైదరాబాద్ NRI మృతి!

ABN , First Publish Date - 2022-05-24T17:08:26+05:30 IST

సౌదీ అరేబియాలోని మక్కాలో విషాద ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై ప్రమాదవశాత్తు ఓ భవనంపై నుంచి పడి మృతి చెందాడు.

Makkah లో విషాద ఘటన.. భవనంపై నుంచి పడి హైదరాబాద్ NRI మృతి!

జెడ్డా: సౌదీ అరేబియాలోని మక్కాలో విషాద ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై ప్రమాదవశాత్తు ఓ భవనంపై నుంచి పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం(మే 22న) జరిగింది. మృతుడిని మొహిద్దీన్ అజీజ్‌గా గుర్తించారు. అతని స్వస్థలం హైదరాబాద్‌లోని యాకుత్‌పురా. గత పదేళ్ల నుంచి సౌదీ అరేబియాలో పని చేస్తున్నాడు. జెడ్డాలోని అజిజియా ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నట్లు అతని బంధువులు తెలిపారు. మక్కాలో టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు. ఎప్పటిలానే ఆదివారం కూడా డ్యూటీకి వెళ్లిన అజీజ్ పనిచేసే చోట ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి చనిపోయాడు. ఇక ఈ ఘటనపై భారత కాన్సులేట్, లోకల్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని స్థానికంగా ఖననం చేయనున్నట్లు అజీజ్ కుటుంబ సభ్యులు తెలిపారు. 

Updated Date - 2022-05-24T17:08:26+05:30 IST