హైదరాబాద్ పాతబస్తీలో దారుణం
ABN , First Publish Date - 2021-11-25T23:36:30+05:30 IST
హైదరాబాద్: పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాల పేరుతో ఇద్దరు యువతులపై ఓ బాబా అత్యాచారానికి ఒడిగట్టాడు.
హైదరాబాద్: పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాల పేరుతో ఇద్దరు యువతులపై ఓ బాబా అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లికి వైద్యం కోసం ఇద్దరు యువతులు రాగా.. వారిపై మంత్రాల నెపంతో సదరు బాబా అత్యాచారానికి తెగబడ్డాడు. అనంతరం అందులోని ఓ యువతికి విడాకులిప్పించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ వివాహితపై బాబా కుమారుడు సైతం అత్యాచారానికి పాల్పడి తమ కుటుంబాన్ని ఆర్థికంగా కుంగదీసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాబా, అతడి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు.