హైదరాబాద్లో ఒమైక్రాన్ బాధితుల కాంటాక్ట్ ట్రేస్
ABN , First Publish Date - 2021-12-16T15:53:03+05:30 IST
నగరంలో ఒమైక్రాన్ బారిన పడ్డ ఇద్దరు బాధితుల కాంటాక్ట్ను అధికారులు ట్రేస్ చేస్తున్నారు.
హైదరాబాద్: నగరంలో ఒమైక్రాన్ బారిన పడ్డ ఇద్దరు బాధితుల కాంటాక్ట్ను అధికారులు ట్రేస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 136 కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. రేపు ఉదయానికి రిపోర్ట్ రానుంది. అందులో కరోనా పాజిటివ్ వచ్చిన వారి జినోమ్ సిక్వెన్స్కు పపించాల్సి ఉంటుంది. పారామౌంట్ కాలనీలో ఈ రోజు మరిన్ని కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. 40 మంది వైద్య సిబ్బంది కాలనీ అపార్ట్మెంట్లలో పూర్తి స్థాయిలో పరీక్షలు చేపట్టనున్నారు. అన్ని రిపోర్ట్లకు కనీసం 48 గంటలు పట్టే అవకాశం ఉంది. నగరంలో ఇద్దరు విదేశీయులకు ఒమైక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. టోలిచౌకి పారమౌంట్ కాలనీలో సోమాలియా, కెన్యా దేశాల నుండి వచ్చిన ఇద్దరు విదేశీయులు ఒమైక్రాన్ బారిన పడగా... ప్రస్తుతం వారు టిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.