వరద బాధితులకు అండగా.. విక్రం రెడ్డి, శిల్పా రెడ్డి, ఆనంద్

ABN , First Publish Date - 2020-10-26T19:05:58+05:30 IST

మొన్నటి భారీ వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాలు ముంపుకు గురైన విషయం తెలిసిందే. తినడానికి తిండి లేక, కొన్ని చోట్ల ఇళ్లను కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారికి

వరద బాధితులకు అండగా.. విక్రం రెడ్డి, శిల్పా రెడ్డి, ఆనంద్

హైదరాబాద్: మొన్నటి భారీ వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాలు ముంపుకు గురైన విషయం తెలిసిందే. తినడానికి తిండి లేక, కొన్ని చోట్ల ఇళ్లను కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారికి ప్రముఖ వైద్యులు, లఘు చిత్రాల దర్శకులు, సామాజిక కార్యకర్త డాక్టర్ ఆనంద్ మిత్రబృందం అండగా నిలిచింది. డాక్టర్ ఆనంద్ తన బంజారా ఎన్జీవో ఆధ్వర్యంలో స్నేహితులు విక్రం రెడ్డి, శిల్పా రెడ్డి సాయంతో హయత్ నగర్  ప్రాంతంలో దాదాపు 500 మంది పేద ప్రజలకు భోజన వసతిని కల్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా కోవిడ్ సహాయక శిబిరాలను మిత్రుల సహకారంతో నిర్వహిస్తున్నానని, ఇంకా దాతలు ముందుకు వచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు. 

Updated Date - 2020-10-26T19:05:58+05:30 IST