లారీ కింద ఇరుక్కుపోయిన వ్యక్తి...15నిమిషాలు నరకయాతన

ABN , First Publish Date - 2021-02-27T18:05:44+05:30 IST

నగరంలోని ఎల్బీనగర్ పరిధిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్ రింగ్ రోడ్డు నుండి టీకేఆర్ కమాన్ వైపు వెళ్తున్న టూవీలర్‌ను టిప్పర్ లారీ ఢీకొట్టింది.

లారీ కింద ఇరుక్కుపోయిన వ్యక్తి...15నిమిషాలు నరకయాతన

హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ పరిధిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది.  సాగర్ రింగ్ రోడ్డు నుండి టీకేఆర్ కమాన్ వైపు వెళ్తున్న టూవీలర్‌ను టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి తన వాహనంతో సహా లారీ కింద ఇరుక్కుపోయాడు. దాదాపు 15 నిమిషాల పాటు ఆ వ్యక్తి నరకయాతన అనుభవించాడు. లారీ కింద ఇరుక్కుపోయిన వ్యక్తిని బయటకు తీసేందుకు జేసీబీ ఆలస్యంగా రావడంతో స్థానికుల సాయంతో ఎల్పీనగర్ పోలీసులు తీవ్రంగా గాయపడిన వ్యక్తిని బయటకు తీశారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-02-27T18:05:44+05:30 IST