అనంత విష్ణుపై కేసు.. భగ్గుమన్న మహిళలు

ABN , First Publish Date - 2022-07-09T23:18:18+05:30 IST

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ (Saifabad Police Station)‎ను మహిళలు ముట్టడించారు. జై మహా భారత్ పార్టీ వ్యవస్థాపకుడు అనంత విష్ణు...

అనంత విష్ణుపై కేసు.. భగ్గుమన్న మహిళలు

హైదరాబాద్ (Hyderabad): సైఫాబాద్ పోలీస్ స్టేషన్ (Saifabad Police Station)‎ను మహిళలు (Womens) ముట్టడించారు. జై మహా భారత్ పార్టీ వ్యవస్థాపకుడు అనంత విష్ణు (Jai Maha Bharat Chief Anantha Vishnu)పై పోలీసులు పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ముందస్తుగా మహిళా పోలీసులు మోహరించారు. జై మహాభారత్ పార్టీ సభ్యత్వం తీసుకునే మహిళకు 200 గజాల స్థలం లేదా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు (Double Bed Room House) ఇస్తామని అనంత విష్ణు ప్రకటించారు. దాంతో పెద్ద ఎత్తున మహిళలు లక్డీకాపూల్‎లోని కార్యాలయానికి తరలివచ్చారు. ఇది కాస్త కాంట్రవర్సీగా మారడంతో పోలీసులు విష్ణు ప్రభుపై కేసు నమోదు చేశారు. 



Updated Date - 2022-07-09T23:18:18+05:30 IST