Hyderabad: ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ యువ మోర్చా

ABN , First Publish Date - 2022-06-16T18:33:32+05:30 IST

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రధాన రహదారిపై ప్రభుత్వ దిష్టిబొమ్మను యువ మోర్చా నాయకులు దగ్ధం చేశారు.

Hyderabad: ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ యువ మోర్చా

హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయం ప్రధాన రహదారిపై ప్రభుత్వ దిష్టిబొమ్మను యువ మోర్చా నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్(Bhanu prakash) మాట్లాడుతూ... బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు   తమ సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేస్తున్నారన్నారు. 6 వందల మంది విద్యార్థులు 12 డిమాండ్లతో పోరాటం చేస్తుంటే.. విద్యాశాఖ మంత్రి సిల్లీ సమస్యలంటూ ఎగతాళి చేశారని మండిపడ్డారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను చర్చల పేరుతో బెదిరింపులకు గురి చేసిన నిర్మల్ జిల్లా కలెక్టర్‌ను తొలగించాలన్నారు. ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కరించాలని అన్నారు. లేనిపక్షంలో రేపటి నుంచి బాసరకు వెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని భానుప్రకాష్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-06-16T18:33:32+05:30 IST