Hyderabad: ఎస్బీఐ పేరుతో నకిలీ కాల్సెంటర్ గుట్టురట్టు
ABN , First Publish Date - 2021-12-02T15:18:19+05:30 IST
ఎస్బీఐ పేరుతో నకిలీ కాల్సెంటర్ గుట్టును పోలీసులు రట్టు చేశారు.
హైదరాబాద్: ఎస్బీఐ పేరుతో నకిలీ కాల్సెంటర్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఢిల్లీ కేంద్రంగా ఎస్బీఐ నకిలీ కాల్సెంటర్ నడుస్తోంది. దీనికి సంబంధించి 14 మందిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్ సెంటర్కు సంబంధించిన ఖాతాల్లో లక్షల రూపాయల నగదును పోలీసులు నిలుపుదల చేశారు. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ముఠాసభ్యులు నిందితులుగా ఉన్నారు. ఎస్బీఐ కేవైసీ, క్రెడిట్ కార్డుల పేరిట ముఠా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.