తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో మరొకరు అరెస్ట్
ABN , First Publish Date - 2021-12-03T13:53:05+05:30 IST
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో మరొకరని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో మరొకరిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. 12వ నిందితుడు యోహాన్ రాజు భార్య ప్రమీలారాణి అరెస్ట్ అయ్యాయి. ప్రమీలారాణిని విజయవాడలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా తెలుగు అకాడమీ నిధుల రికవరీపై పోలీసులు దృష్టి పెట్టారు. ప్రధాన సూత్రధారులు చుండూరు వెంకట సాయికుమార్, నండూరి వెంకటరమణ కలిసి విశాఖ శివార్లలో ప్లాట్లు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ప్లాట్ల కొనుగోలుకు చెల్లింపులపైనా సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు.