Telangana CSకు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు
ABN , First Publish Date - 2021-09-30T16:06:55+05:30 IST
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు...
హైదరాబాద్ సిటీ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్వేపై అతివేగంగా వెళ్లినందుకు ఆయన వాహనానికి ఓవర్స్పీడ్ చలానాలు విధించారు. సోమేష్ కుమార్ అధికారిక వాహనం(టీఎస్09ఎఫ్ఏ0001)కు రూ.3వేలు చలానా విధించారు. విషయం తెలియగానే అధికారులు జరిమానా చెల్లించారు. ఈ విషయమై టోలిచౌకి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను అడగగా చలానా విభాగం ప్రధాన కార్యాలయం నుంచి చలానాలు జారీ అయినట్లు తెలిపారు.