ఇందిరాపార్క్ వద్ద TRS మహాధర్నా...పాల్గొన్న సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2021-11-18T17:06:29+05:30 IST

కేంద్రంపై పోరుబాట పట్టిన టీఆర్ఎస్ నగరంలోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టింది.

ఇందిరాపార్క్ వద్ద TRS మహాధర్నా...పాల్గొన్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: కేంద్రంపై పోరుబాట పట్టిన టీఆర్ఎస్.. నగరంలోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి, మల్లారెడ్డి, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గంగుల, సబిత, సత్యవతీ రాథోడ్, కొప్పుల ఈశ్వర్, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీచైర్ పర్సన్‌లు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా జరుగనుంది. అనంతరం గవర్నర్‌ను  మంత్రులు కలిసి మెమోరాండం ఇవ్వనున్నారు. 


Updated Date - 2021-11-18T17:06:29+05:30 IST