Bihar‎లో హైదరాబాద్ పోలీసులకు తృటిలో తప్పిన ప్రాణాపాయం

ABN , First Publish Date - 2022-08-15T03:54:36+05:30 IST

హైదరాబాద్ పోలీసులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. సైబర్ దుండగులను ...

Bihar‎లో హైదరాబాద్ పోలీసులకు తృటిలో తప్పిన ప్రాణాపాయం

బీహార్: హైదరాబాద్ పోలీసులకు (Hyderbad Police) తృటిలో ప్రాణాపాయం  తప్పింది. సైబర్ దుండగులను (Cyber Frauds) పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు బీహార్ వెళ్లారు. బీహార్‌ (Bihar)లోని నవాడాలో దాడులు నిర్వహించారు. దీంతో పోలీసులపై సైబర్ ముఠా కాల్పులు జరిపింది. అయితే చాకచక్యంగా తప్పించుకుని నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు మిథిలేష్ ప్రసాద్ తప్పించుకున్నాడు. నిందితుల నుంచి కోటి 22 లక్షల 77 వేల రూపాయల నగదుతో పాటు 3 లగ్జరీ వాహనాలు, 5 స్మార్ట్ ఫోనులను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-08-15T03:54:36+05:30 IST