కార్ల బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న హ్యుందాయ్

ABN , First Publish Date - 2020-12-02T03:00:45+05:30 IST

కార్ల బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న హ్యుందాయ్

కార్ల బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న హ్యుందాయ్

న్యూఢిల్లీ: ప్రస్తుతం తమ వినియోగదారులు 25,000 హ్యుందాయ్ ఐ20 కార్లను బుకింగ్ చేసుకున్నట్లు ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ పేర్కొంది. గత నెలలో భారత మార్కెట్‌లో ఐ20 కొత్త కార్లను విడుదల చేసినట్లు హ్యుందాయ్ ఇండియా ప్రకటించింది.


అప్పటికే ఐ20 కారు కోసం 20,000 బుకింగ్స్ నమోదయ్యాయి. కార్ల బుకింగ్ సంఖ్య ఇప్పుడు 25 వేల మార్కును దాటిందని హ్యుందాయ్ పేర్కొంది. హ్యుందాయ్ ఐ20 కారు ప్రారంభ ధర రూ. 6.80 లక్షలు ఉంటుంది. హ్యుందాయ్ ఐ20 కారు మాగ్నా, స్పోర్ట్స్, ఆస్టా, అస్తా (ఓ) నాలుగు వేరియంట్లలో రూపొందించబడింది.

Updated Date - 2020-12-02T03:00:45+05:30 IST