మూడేళ్ల కూతుర్ని చెల్లికి ఇచ్చి ఓ భార్య బలవన్మరణం.. గదిలో దొరికిన లేఖలో రాసింది చదివి నివ్వెరపోయిన బంధువులు..!
ABN , First Publish Date - 2022-08-23T20:46:11+05:30 IST
రాజస్థాన్ (Rajasthan)లోని జైపూర్లో ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
రాజస్థాన్ (Rajasthan)లోని జైపూర్లో ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు, ఆమె తన మూడేళ్ల కూతురుని తన సోదరి వద్ద వదిలివేసింది. పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భర్తపై తనకు ఉన్న ప్రేమ గురించి ఆమె సూసూడ్ నోట్లో రాసింది. అలాగే భర్తను జైలుకు పంపవద్దని కోరింది. కాగా, మృతురాలి సోదరి మాత్రం కేసు పెట్టింది.
ఇది కూడా చదవండి..
తెల్లవారుజామున అలికిడి.. నిద్రలేచి చూసిన 10 ఏళ్ల కూతురికి కనిపించిన దృశ్యం చూసి మైండ్బ్లాక్.. అరిస్తే చంపేస్తానంటూ..
వికాస్ బిస్వాల్, సంగీతా బిస్వాల్ (23) తమ మూడేళ్ల కుమార్తె రోష్నితో కలిసి ప్రతాప్ నగర్లో నివసిస్తున్నారు. ఆదివారం సాయంత్రం సంగీత తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు ఆమెను పిలవడానికి గదిలోకి వెళ్లి చూడగా ఆమె ఉరివేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న ప్రతాప్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు ముందు సంగీత రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
`నా భర్త అంటే నాకు చాలా ఇష్టం. అతను లేకుండా నేను జీవించలేను. నా భర్తను జైలుకు పంపొద్దు` అని సంగీత సూసైడ్ నోట్లో రాసింది. సంగీతను ఆమె భర్త చాలా రోజులుగా మానసికంగా వేధిస్తున్నాడని, రోజూ మద్యం సేవించి హింసించేవాడని ఆమె సోదరి జర్నా పోలీసులకు చెప్పింది. ఆత్మహత్యకు ఒకరోజు ముందు కూడా సంగీతను ఆమె భర్త అందరి ముందు కొట్టాడని తెలిపింది. సంగీత తన భర్తను వదిలేయాలనుకుందని, కానీ, చివరకు ఈ లోకాన్నే వదిలేసిందని జర్నా తెలిపింది. మృతురాలి భర్తపై జర్నా కేసు పెట్టింది.