చెప్పను.. చేసి చూపిస్తా
ABN , First Publish Date - 2021-10-18T04:35:08+05:30 IST
‘‘నాది చెప్పే మనస్తత్వం కాదు. ఏదైనా చేసి చూపిస్తా’’ అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని మెథడిస్ట్ చర్చిలో రూ.25లక్షలతో నిర్మించిన ప్యారిస్ భవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సంగారెడ్డి రూరల్, అక్టోబరు 17: ‘‘నాది చెప్పే మనస్తత్వం కాదు. ఏదైనా చేసి చూపిస్తా’’ అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని మెథడిస్ట్ చర్చిలో రూ.25లక్షలతో నిర్మించిన ప్యారిస్ భవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. తన బాల్యం నుంచి ఎంతో ప్రేమ, ఆప్యాయత చూపుతూ, ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. తనకు కూడా అంతే ప్రేమ ఉన్నదని, ఆ ప్రేమతో తాను ఏమి చేస్తానో చెప్పనని, త్వరలో మళ్లీ వచ్చి చేసి చూపుతానని పేర్కొన్నారు. తాను ఏది మాట్లాడినా మనస్ఫూర్తిగా మాట్లాడతానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాగా మెయిన్ రోడ్డు నుంచి మెథడిస్ట్ చర్చి వరకు సీసీ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. చర్చి మరమ్మతులు, మౌలిక వసతులు, ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి, సంఘం నాయకులు ఇమానుయేల్, చర్చి అధ్యక్ష, కార్యదర్శులు మధు, సునీల్కుమార్, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ విజయ్కుమార్, జార్జి, మదన్కుమార్, మధు, సుధాకర్బాబు, సురే్షకుమార్, యూత్ కార్యదర్శి వినయ్ఫిలిప్, బెన్ని కెన్ని, ఇనోక్, వినయ్, నికిత, వయేల పాల్గొన్నారు.