నిన్న Ias అధికారి.. నేడు ఖైదీ నెం.6773
ABN , First Publish Date - 2022-07-07T16:17:22+05:30 IST
ఆయనో మాజీ జిల్లా అధికారి.. భూ వివాదంలో లంచం డిమాండ్ చేసిన కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లారు. బెంగళూరు నగర మాజీ జిల్లా
బెంగళూరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఆయనో మాజీ జిల్లా అధికారి.. భూ వివాదంలో లంచం డిమాండ్ చేసిన కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లారు. బెంగళూరు నగర మాజీ జిల్లా అధికారి జే మంజునాథ్ పరప్పన అగ్రహార జైలులో ఖైదీ నెంబరు 6773గా ఉన్నారు. మంగళవారం మంజునాథ్ను విచారణ ఖైదీగా పరప్పన అగ్రహార జైలుకు పంపారు. అక్కడ నిబంధనల ప్రకారం అతడికి ఖైదీగా గుర్తింపు నెంబరు కేటాయించారు. మంజునాథ్కు చెందిన యశ్వంతపురలోని ఓ ప్లాట్పై ఏసీబీ అధికారులు దాడి చేసి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అతడి బ్యాంకు ఖాతాలపైనా విచారణ కొనసాగిస్తున్నారు.