ఇద్దరు ఐఏఎస్ అధికారుల బాధ్యతల్లో మార్పులు చేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-08-08T18:44:31+05:30 IST

అమ‌రావ‌తి: రాష్ట్రంలో ఇద్ద‌రు ఐఏఎస్ అధికారుల బాధ్యతల్లో ప్రభుత్వం మార్పులు చేసింది.

ఇద్దరు ఐఏఎస్ అధికారుల బాధ్యతల్లో మార్పులు చేసిన ప్రభుత్వం

అమ‌రావ‌తి: రాష్ట్రంలో ఇద్ద‌రు ఐఏఎస్ అధికారుల బాధ్యతల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. స‌మ‌గ్ర‌ శిక్షా అభ‌యాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ బాధ్య‌త‌ల నుంచి చిన‌వీర‌భ‌ద్రుడుని ప్రభుత్వం త‌ప్పించింది. పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్ట‌ర్‌గా ఆయనను కొనసాగిస్తోంది. స‌మ‌గ్ర‌శిక్షా అభ‌యాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్‌గా కె,వెట్రిసెల్వికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఆంగ్ల మాధ్యమం అమ‌లు ప్రాజెక్ట్  ప్రత్యేక అధికారిగా వెట్రిసెల్వికి పూర్తి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-08-08T18:44:31+05:30 IST