తప్పుడు వార్తలు.. యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం

ABN , First Publish Date - 2022-04-05T22:18:47+05:30 IST

దేశ వ్యతిరేక అంశాల్ని ప్రసారం చేయడంతోపాటు, అసత్య వార్తల్ని ప్రచారం చేస్తున్నారనే ఉద్దేశంతో పలు యూట్యూబ్ ఛానెళ్లపై కొరడా ఝుళిపించింది భారత సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ (ఐ అండ్ బీ మినిస్ట్రీ). దేశానికి చెందిన 18 యూట్యూబ్ ఛానెళ్లతోపాటు, పాకిస్తాన్‌కు చెందిన నాలుగు యూట్యూబ్ ఛానెళ్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

తప్పుడు వార్తలు.. యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం

దేశ వ్యతిరేక అంశాల్ని ప్రసారం చేయడంతోపాటు, అసత్య వార్తల్ని ప్రచారం చేస్తున్నారనే ఉద్దేశంతో పలు యూట్యూబ్ ఛానెళ్లపై కొరడా ఝుళిపించింది భారత సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ (ఐ అండ్ బీ మినిస్ట్రీ). దేశానికి చెందిన 18 యూట్యూబ్ ఛానెళ్లతోపాటు, పాకిస్తాన్‌కు చెందిన నాలుగు యూట్యూబ్ ఛానెళ్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఛానెళ్లు పలు న్యూస్ ఛానెళ్లకు చెందిన లోగోలను వాడుకుంటూ, తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి వ్యూయర్స్‌ను మోసం చేస్తున్నాయని ఐ అండ్ బీ మినిస్ట్రీ పేర్కొంది. ఈ ఛానెళ్లు ప్రధానంగా జమ్ము-కాశ్మీర్, భారత సైన్యంపై తప్పుడు అంశాల్ని ప్రచారం చేస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతున్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్లలో భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియా అకౌంట్లతోపాటు, కొన్ని యూట్యూబ్ ఛానెళ్లను ఐ అండ్ బీ మినిస్ట్రీ నిషేధించింది.

Updated Date - 2022-04-05T22:18:47+05:30 IST