పోతారంలో ఐసీడీఎస్‌ స్థలం కబ్జా

ABN , First Publish Date - 2021-04-23T06:24:40+05:30 IST

పోతారంలో ఐసీడీఎస్‌ స్థలం కబ్జా

పోతారంలో ఐసీడీఎస్‌ స్థలం కబ్జా

తరిగొప్పుల, ఏప్రిల్‌ 22: మండలంలోని పోతారం గ్రామంలో అంగన్‌వాడి క్రీడ మైదానం కబ్జాకు గురవుతోంది. పోతారం రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నంబరు 22/బి లో అప్పటి పంచాయతీ పాలకవర్గం అంగన్‌వాడి భవన నిర్మాణంతోపాటు క్రీడా మైదానం కోసం ఐసీడీఎస్‌ వారికి 2014లో 300 గజాల భూమిని  కేటాయించింది. ఆ స్థలం వెనుక భాగంలో అంగన్‌వాడి భవనం నిర్మించగా ముందున్న స్థలాన్ని పిల్లల క్రీడామైదానం కోసం వదిలిపెట్టారు. ఈ స్థలంపై కన్నేసిన ఓ వ్యక్తి  ఎలాంటి  అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు చేపడుతున్నాడు. ఈ విషయమై జనగామ ఐసీడీఎస్‌ సీడీపీవో రమాదేవిని వివరణ కోరగా క్రీడా మైదానం కబ్జాకు గురైన విషయం ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని, విచారణ జరిపి పైఅధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. 


Updated Date - 2021-04-23T06:24:40+05:30 IST