శ్రీవారిని దర్శించుకున్న ఇచ్ఛాపురం పీఠాధిపతి
ABN , First Publish Date - 2022-10-02T05:14:42+05:30 IST
శ్రీమత ఖాద్రీలక్ష్మీనరసిం హస్వామిని శనివారం నైమిశ్యారణ పీఠం హిందూ ధార్మిక సేవాసమితి, ఇచ్చా పురం పీఠాధిపతి శ్రీబాల బ్రహ్మానంద సరస్వతి శ్రీవారిని దర్శించుకున్నారు.
్లకదిరిఅర్బన, అక్టోబరు 1: శ్రీమత ఖాద్రీలక్ష్మీనరసిం హస్వామిని శనివారం నైమిశ్యారణ పీఠం హిందూ ధార్మిక సేవాసమితి, ఇచ్చా పురం పీఠాధిపతి శ్రీబాల బ్రహ్మానంద సరస్వతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయచైర్మన గోపాలక్రిష్ణ, ఈఓ పట్టెం గురుప్రసాద్, ప్రధానాచార్చ కులు నరసింహాచారి, పార్థసారఽథాచారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారి చిత్రపటం, శేష వస్ర్తాలతో ఆయనను సత్క రించి, తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఉపని షత్తులు ధార్మిక విషయాలు, హిందూ ధర్మవిశిష్టతను ఆయన వివరించారు.