ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూ ఫుల్‌

ABN , First Publish Date - 2020-08-08T09:32:25+05:30 IST

కరోనా బాధితులకు ఆసుపత్రుల సమాచారాన్ని అధికారులు గంటగంటకూ అందుబాటులో ఉంచుతున్నారు.జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు ఆదేశాల మేరకు ఆసుపత్రి ముందు డిస్‌ప్లే బోర్డును ..

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూ ఫుల్‌

ఏలూరు క్రైం, ఆగస్టు 7 : కరోనా బాధితులకు ఆసుపత్రుల సమాచారాన్ని అధికారులు గంటగంటకూ అందుబాటులో ఉంచుతున్నారు.జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు ఆదేశాల మేరకు ఆసుపత్రి ముందు డిస్‌ప్లే బోర్డును ఏర్పాటు చేశారు.దీనిలో గంట గంటకూ ఆసుపత్రుల్లో బెడ్‌ల సమాచారం నిక్షిప్తం చేస్తున్నారు. శుక్రవారం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూ పడకలు 20 ఉండగా అన్ని పూర్తిగా నిండిపోయాయి.


ఆక్సిజన్‌ కలిగిన పడకలు 26 ఉండగా మరో 22 అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్‌ లేని పడకలు 65 ఉండగా నాలుగు అందుబాటులో ఉన్నాయి. మిగిలినవి సాధారణ వార్డుకు సంబంధించిన పడకలు ఉన్నాయి. ఆశ్రం ఆసుపత్రిలో వెయ్యి పడకలకు ఇంకా 421 పడకలు, తాడేపల్లి గూడెం ప్రభుత్వాసుపత్రిలో 150 పడకలకు 29 పడకలు ఖాళీగా ఉన్నాయి. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం రాత్రి 8 గంటలకు 220 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌  ఏవీఆర్‌ మోహన్‌ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలందిస్తున్నారు.  

Updated Date - 2020-08-08T09:32:25+05:30 IST