దళిత బంధు దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2022-05-21T03:34:09+05:30 IST

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నా రు. దేవునిగూడలో లబ్ధిదా రులకు మంజూరైన ట్రాక్ట ర్లను శుక్రవారం ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. దళితులను ధనవంతులను చేయడానికి సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారునికి రూ. 10 లక్షలు అందిస్తా మని, దళితులు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి చెందాలన్నారు. రాంపూర్‌లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దళిత బంధు దేశానికే ఆదర్శం
లబ్ధిదారులకు ట్రాక్టర్‌లను అందజేస్తున్న ఎమ్మెల్యే రేఖానాయక్‌

జన్నారం, మే 20 : సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నా రు. దేవునిగూడలో లబ్ధిదా రులకు మంజూరైన ట్రాక్ట ర్లను శుక్రవారం ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. దళితులను ధనవంతులను చేయడానికి సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారునికి రూ. 10 లక్షలు అందిస్తా మని, దళితులు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి చెందాలన్నారు.  రాంపూర్‌లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌లో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీపీ మాదాడి సరోజన, వైస్‌ ఎంపీపీ వినయ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజారాంరెడ్డి, రాజేష్‌ యాదవ్‌, కోఆప్షన్‌ మున్వర్‌ఆలీఖాన్‌, సర్పంచు శిరీష గోపాల్‌రెడ్డి, ఎంపీడీవో అరుణరాణి, ప్రజలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T03:34:09+05:30 IST