రామానుజ సమతామూర్తి విగ్రహావిష్కరణ
ABN , First Publish Date - 2022-02-06T00:16:59+05:30 IST
శంషాబాద్ సమీపంలోని ముచ్చింత్లో గల రామానుజ సమతామూర్తి
హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని ముచ్చింత్లో గల రామానుజ సమతామూర్తి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సమతామూర్తి కేంద్రంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. రా.8 గం.కు రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. రాత్రి 8.25 గంటలకు ఢిల్లీకి ప్రధాని మోదీ తిరుగు ప్రయాణం అవుతారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చినజీయర్, తదితరులు పాల్గొన్నారు.