AP News: నరసరావుపేటలో వేడెక్కిన విగ్రహ రాజకీయాలు
ABN , First Publish Date - 2022-08-31T19:15:08+05:30 IST
జిల్లాలోని నరసరావుపేటలో విగ్రహ రాజకీయాలు వేడెక్కాయి.
పల్నాడు: జిల్లాలోని నరసరావుపేటలో విగ్రహ రాజకీయాలు వేడెక్కాయి. పల్నాడు సెంటర్లో వైఎస్ (YSR) విగ్రహాన్ని వైసీపీ నేతలు (YCP Leaders) ఏర్పాటు చేశారు. అనుమతి లేని విగ్రహం ఏర్పాటును నిలిపివేయాలని హైకోర్టు (AP High court) ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల జారీ చేసినప్పటికీ వైఎస్ విగ్రహ (Idol of YSR)ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కోర్టు ఆదేశాలతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో కోర్టు దిక్కారణ పిటీషన్ దాఖలు చేసేందుకు టీడీపీ (TDP) సిద్ధమవుతోంది.