ప్రశ్నిస్తే దాడులా..?
ABN , First Publish Date - 2021-10-23T05:27:49+05:30 IST
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్న వారిపై దాడులు చేయడం హేయమైన చర్య అని జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి అన్నారు.
జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు వనజాక్షి
నెల్లిమర్ల: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్న వారిపై దాడులు చేయడం హేయమైన చర్య అని జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి అన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ మేరకు జరజాపుపేటలో శుక్రవారం దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కడం ఎవరి తరం కాదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా మహిళా కార్యదర్శి లెంక హైమావతి, నెల్లిమర్ల కౌన్సిలర్లు చింతాడ కళావతి, పలువురు మహిళలు పాల్గొన్నారు.