తీరు మార్చుకోకపోతే తిరుగుబాటు
ABN , First Publish Date - 2022-07-08T04:21:37+05:30 IST
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి, వైసీపీ నాయకులు తీరు మార్చుకోకుంటే తిరుగుబాటుకైనా సిద్ధమేనని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హెచ్చరించారు.
కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం,జూలై7: కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి, వైసీపీ నాయకులు తీరు మార్చుకోకుంటే తిరుగుబాటుకైనా సిద్ధమేనని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హెచ్చరించారు. గురువారం స్థానిక 11,12,13,14 వార్డుల్లో బాదుడే బాదుడు, ఇంటింటిటి తెలుగుదేఽశం సందర్భంగా ఆయన ప్రభుత్వ వైఫల్యాలు, పెరిగిన ఽగ్యాస్, నిత్యావసరాలు, ఆర్టీసీ, విద్యుత్ చార్జీలపై ప్రజలకు వివరించారు. కామాక్షితాయి ఆలయ భూములను కూడా మట్టి మాఫియా వదలలేదంటే ఆలయ అధికారులు, కలెక్టర్, ఎస్పీ, సెబ్ అధికారులు ఎందుకుమౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. బుచ్చి నుంచి బదిలీ అయిన కమిషనర్ గొప్పవాడని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పడు అక్కడి కమిషనర్ ఇక్కడికి, ఇక్కడి కమిషనర్ అక్కడికి మార్చుకుంటూ రాజ్యాంగాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారన్నారు. తొలుత మహిళలు పోలంరెడ్డికి పూలమాలలతో స్వాగతించి ఈ సారి ఎన్నికల్లో టీడీపీదే విజయమని భరోసా ఇచ్చారు. బుచ్చి నగరం పంచాయతీలోని సుబ్బారెడ్డినగర్తోపాటు పలు ప్రాంతాలు మురుగు దుర్గంధంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు గాలికొదిలేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎం.వి.శేషయ్య, ప్రభాకర్రెడ్డి, కొండయ్య, శ్రీనివాసులు, పురుషోత్తం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
.