కార్యకర్తలకు కష్టమొస్తే అర్ధరాత్రి అయినా స్పందిస్తా

ABN , First Publish Date - 2021-07-27T04:40:42+05:30 IST

తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఏ కష్టమొచ్చినా అర్ధరాత్రి అయినా అందుబాటులో ఉంటానని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు.

కార్యకర్తలకు కష్టమొస్తే అర్ధరాత్రి అయినా స్పందిస్తా

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి

కడప, జూలై 26 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఏ కష్టమొచ్చినా అర్ధరాత్రి అయినా అందుబాటులో ఉంటానని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు. కడప నగర అద్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి సోమవారం పుత్తా నరసింహారెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ పునర్‌వైభవ నిర్మణం కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. వ చ్చే ఎన్నికలే లక్ష్యంగా కార్యకర్తలందరూ కష్టపడాలని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కడప పార్లమెంటు ఉపాధ్యక్షుడు నక్కల శివరాం, రవిశంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:40:42+05:30 IST