ఆర్ఎస్ఎస్ లేకపోతే ఇండియా మరో పాక్ అయ్యేది: బీజేపీ నేత

ABN , First Publish Date - 2021-10-07T00:27:01+05:30 IST

రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) లేకపోతే దేశం ఈపాటికి పాకిస్తాన్‌లా తయారయ్యేదని కర్ణాటక జంతు సంక్షేమ శాఖ మంత్రి ప్రభు చౌహాన్ అన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమార స్వామి, ఆర్ఎస్ఎస్‌పై చేసిన వ్యాఖ్యలకు బుధవారం చౌహాన్ సమాధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు...

ఆర్ఎస్ఎస్ లేకపోతే ఇండియా మరో పాక్ అయ్యేది: బీజేపీ నేత

బెంగళూరు: రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) లేకపోతే దేశం ఈపాటికి పాకిస్తాన్‌లా తయారయ్యేదని కర్ణాటక జంతు సంక్షేమ శాఖ మంత్రి ప్రభు చౌహాన్ అన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమార స్వామి, ఆర్ఎస్ఎస్‌పై చేసిన వ్యాఖ్యలకు బుధవారం చౌహాన్ సమాధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆర్ఎస్ఎస్ అనే దేశభక్తి కలిగిన సంస్థ ఉంది కాబట్టే భారత్ సురక్షితంగా ఉంది. లేదంటే ఈ దేశం మరో పాకిస్తాన్ అయ్యేది. ఆర్ఎస్ఎస్ ఉందనే కారణంగానే ప్రజలు స్వేచ్ఛగా ఉంటున్నారు’’ అని చౌహాన్ అన్నారు. దీనికి ముందు కుమారస్వామి ఆర్ఎస్ఎస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘దేశంలో 4,000 మందికి ఆర్ఎస్ఎస్ శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు వాళ్లే బ్యూరోక్రసీలో ఉన్నారు. వాళ్లే అన్ని ప్రభుత్వ సంస్థల్ని నియంత్రిస్తున్నారు. దేశం మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తీసుకుని పాలిస్తున్నారు’’ అని కుమారస్వామి అన్నారు.

Updated Date - 2021-10-07T00:27:01+05:30 IST