గడ్డి మందు కొడితే.. మొక్కజొన్న పంట మాడిపోయింది
ABN , First Publish Date - 2021-07-28T05:55:22+05:30 IST
మండలంలోని బేగంపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు పీరవ్వ కాస్లాబాద్ శివారులో ఒక ఎకరంలో సోయా పంట, ఒక ఎకరంలో మొక్కజొన్న పంటను వేసింది.
దుకాణదారుడిని నిలదీస్తే.. వత్తాసు పలికిన ఏవో
ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. న్యాయం చేయాలని డిమాండ్
పెద్ద కొడప్గల్, జూలై 27: మండలంలోని బేగంపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు పీరవ్వ కాస్లాబాద్ శివారులో ఒక ఎకరంలో సోయా పంట, ఒక ఎకరంలో మొక్కజొన్న పంటను వేసింది. కాగా, గడ్డి బాగా పెరగడంతో గడ్డి మందు కోసం పెద్ద కొడప్గల్లోని దుకా ణంలో గడ్డి మందు తీసుకోగా, సోయా, మొక్కజొన్న పంటకు అదే మందు పని చేస్తోందని దుకాణ యజమాని ఇచ్చాడు. దీంతో గడ్డి మం దు కొట్టగా మొక్కజొన్న పంట పూర్తిగా మాడిపోయిందని, దీంతో మహిళా రైతు దుకాణదారుడిని మంగళవారం అడుగగా, దురుసుగా సమాధా నం ఇచ్చినట్లు తెలిపారు. రైతులంతా కలిసి దుకాణం ముందు నిరసన తెలుపగా, సంబంధిత ఏవో నజీముద్దీన్ అక్కడికి చేరుకుని, దుకాణదా రునికి వత్తాసు పలికాడు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి రాని ఏవో దుకాణ దారునికి వత్తాసు పలకడం వెనుక మతలబు ఏంట ని ప్రశ్నించారు. సంబంధిత అధికారులు మహిళా రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏవో గ్రామాలకు వచ్చి ఏ ఒక్కరోజు రైతులకు అవగాహన కల్పించిన దాఖలాలు లేవని ఆరోపించారు. ఏ పంటలు వేయాలని, చీడపీడల నివారణకు ఏ మందులు వాడాలో తెలియజేయడం లేదన్నారు. సంబంధిత ఉన్నతాధికారులు దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూడాలన్నారు.