వైసీపీని నమ్మితే..నట్టేట మునగాల్సిందే
ABN , First Publish Date - 2022-09-29T05:50:14+05:30 IST
వైసీపీని ప్రజలు నమ్మితే నట్టేట మునగాల్సిందేనని టీడీపీ మదన పల్లె ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపా టి రమేశ్ పేర్కొన్నారు.
మదనపల్లె టౌన్, సెప్టెంబరు 28: వైసీపీని ప్రజలు నమ్మితే నట్టేట మునగాల్సిందేనని టీడీపీ మదన పల్లె ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపా టి రమేశ్ పేర్కొన్నారు. బుధవారం టీడీపీ మండల అధ్యక్షుడు డి.శ్రీనివా సులు ఆధ్వర్యంలో కోళ్లబైలు పంచాయతీ కాట్లాటపల్లె రోడ్డులో బాదుడే..బాదుడు నిర్వహిం చారు. ఈ సందర్భంగా రమేశ్ మా ట్లాడుతూ ఒక్క అవకాశం అని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్ర ప్రజలకు పన్నుల రూపంలో చుక్క లు చూపారన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ప్రజలు ఓపికగా వేచివున్నారని రానున్న ఎన్నికల్లో జగన్కు ప్రజలే చుక్కలు చూపి గద్దె దించుతారన్నారు. కార్యక్రమంలో దొమ్మలపాటి యశశ్వి, తులసీధర్నాయుడు, మేకలరెడ్డిశే ఖర్, బోయపాటి రాణా, కత్తి అరుణ్, మోహన, మల్రెడ్డి, భాస్కర్రెడ్డి, చంద్ర, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలపై ధరాభారం మోపిన ప్రభుత్వం
బి.కొత్తకోట సెప్టెంబర్ 28 : నిత్యా వసర ధరలు, ఆర్టీసీ, విద్యుత్ చార్జీ లు. పెంచి వైసీపీ ప్రభత్వం ప్రజల పై మోయలేని భారం మో పింద ని టీడీపీ మండల అధ్యక్షుడు నారాయణస్వామిరెడ్డి ఆరోపిం చా రు. బుధవారం బి.కొత్తకోట మండ లంలోని శంకరాపురంలో తెలుగుదే శం పార్టీ ఆధ్వర్యంలో బాదుడే... బా దుడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయ న మాట్లాడుతూ ఒక్క చాన్స్ అని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ఆర్థిక స్థితిని చిన్నాభిన్నం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి దేవరింటి కుమార్, రాష్ట్ర మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి మస్తాన్, బి.కొత్తకోట టౌన్ ప్రెసిడెంట్ బంగా రు వెంకట్ర మణ, నాయకులు కుడుం శ్రీనివాసులు, సుకుమార్, ఆనంద్, దేవుడు నాగరాజు, రియాజ్ అల్లీఖాన్, నరసింహులు, శ్రీరాములు, జయరామిరెడ్డి పాల్గొన్నారు.