ఎమ్మెల్యే కావాలనుకున్నా.. మంత్రులతో ప్రమాణం చేయిస్తున్నా!

ABN , First Publish Date - 2021-03-01T08:58:54+05:30 IST

‘‘ఎమ్మెల్యే కావాలనుకున్నా. ప్రస్తుతం మంత్రుల చేత ప్రమాణం చేయించే ఉన్నతమైన హోదా పొందా’’ అని తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.

ఎమ్మెల్యే కావాలనుకున్నా.. మంత్రులతో ప్రమాణం చేయిస్తున్నా!

మాతృభాషలో ప్రమాణం చేయాలన్న కోరిక 

పుదుచ్చేరి ఎల్‌జీగా తీరింది: గవర్నర్‌ తమిళిసై

చెన్నై, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎమ్మెల్యే కావాలనుకున్నా. ప్రస్తుతం మంత్రుల చేత ప్రమాణం చేయించే ఉన్నతమైన హోదా పొందా’’ అని తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. తెలంగాణా గవర్నర్‌గా ఆంగ్లంలో ప్రమాణస్వీకారం చేసిన తాను.. మాతృభాష తమిళంలో ప్రమాణం చేయాలని ఆశ పడ్డానని, ఆ ఆశ పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా ప్రమాణం చేసినప్పుడు నెరవేరిందని చెప్పారు. ఆదివారం ఆమె కన్యాకుమారి జిల్లా మండక్కాడు భగవతి అమ్మన్‌ ఆలయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఎక్కడ ఉన్నా.. ఏ పదవిలో ఉన్నా.. భగవతి అమ్మవారి ఆలయాన్ని మాత్రం తప్పక సందర్శిస్తుంటానని చెప్పారు. కరోనా వ్యాప్తి ఇంకా తగ్గలేదని, ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆలయాల్లో బిల్వదళాలు, తులసి ఆకులను పూజచేసి ప్రసాదంగా ఇస్తున్నారని, వాటిని సేవిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. 

Updated Date - 2021-03-01T08:58:54+05:30 IST