మాదిగలను విస్మరిస్తే పార్టీలకు గుణపాఠం తప్పదు
ABN , First Publish Date - 2022-05-26T03:57:21+05:30 IST
రాజకీయ పార్టీలు మాదిగలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నాయని, అన్ని రాజకీయ పార్టీలు పదవుల కేటాయింపులో సముచిత స్థానం కల్పించాలని మాదిగ హ క్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ డిమాండ్ చేశారు. నస్పూర్ ప్రెస్క్లబ్లో బుఽధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాదిగలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నాడని ఆరోపించారు.
నస్పూర్, మే 25: రాజకీయ పార్టీలు మాదిగలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నాయని, అన్ని రాజకీయ పార్టీలు పదవుల కేటాయింపులో సముచిత స్థానం కల్పించాలని మాదిగ హ క్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ డిమాండ్ చేశారు. నస్పూర్ ప్రెస్క్లబ్లో బుఽధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాదిగలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నాడని ఆరోపించారు. మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, సచివాలయాలనికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో కోనసీమకు అంబేద్కర్ పేరును వ్యతిరేకిస్తూ విధ్యంసాలు సృష్టిస్తున్న అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాదిగ హక్కుల దండోరా జిల్లా ఇన్చార్జి లింగంపల్లి వెంకటేష్ మాదిగ, జిల్లా అధ్యక్షుడు చిలుక రాజనర్సు మాదిగ, నాయకులు విజయ్ మాదిగ, కిరణ్, గిరిబాబు, పాల్గొన్నారు.