భార్యతో అక్రమ సంబంధం నడుపుతున్న వ్యక్తికి ఆమెతోనే ఫోన్ చేయించి...

ABN , First Publish Date - 2020-11-03T14:17:39+05:30 IST

పథకం ప్రకారం సలోమన్‌రాజుతో మాట్లాడుదామని భార్యతో ఫోన్‌ చేయించి ద్వారా ఇంటికి రప్పించారు. సలోమన్‌రాజు ఇంటికి రాగానే...

భార్యతో అక్రమ సంబంధం నడుపుతున్న వ్యక్తికి ఆమెతోనే ఫోన్ చేయించి...

హత్య కేసులో ఇద్దరి రిమాండ్‌

నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్‌ ప్రాంతంలో జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అందుకు సంబంధించిన వివరాలను నగర ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ సోమవారం విలేకరులకు వెల్లడించారు. చంద్రనగర్‌కు చెందిన సోలమన్‌రాజు (26)అనే వ్యక్తి ఆర్యనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ పక్కనే కొత్తగా నిర్మిస్తున్న ఓ వ్యక్తికి చెందిన ఇంటి పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో పక్కనే నివాసం ఉండే వాచ్‌‌మెన్‌ ఉమాకాంత్‌ భార్య సవితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఉమాకాంత్‌ భార్యతో గొడవ పడ్డాడు. సలోమన్‌రాజును అడ్డు తొలగించుకోవాలని భావించారు.


పథకం ప్రకారం సలోమన్‌రాజుతో మాట్లాడుదామని భార్యతో ఫోన్‌ చేయించి ద్వారా ఇంటికి రప్పించారు. సలోమన్‌రాజు ఇంటికి రాగానే కంట్లో కారం చల్లి ఇనుపరాడ్‌తో తలపై దాడి చేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఉమాకాంత్‌, అతడి భార్య సవితను అరెస్ట్‌ చేసి హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ నాల్గోటౌన్‌ పోలీసు స్టేషన్‌ ఎస్సై లక్ష్మయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-11-03T14:17:39+05:30 IST