ప్రశ్నిస్తే అక్రమ కేసులా : రెడ్యం

ABN , First Publish Date - 2021-04-24T04:21:32+05:30 IST

ప్రభుత్వం అక్రమాలు అవినీతిని ప్రశ్నించినందుకే మాజీ ఎమ్మెల్యే, సంగం డైరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రపై అక్ర మ కేసు నమోదు చేసి అరెస్టు చేయడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ప్రశ్నిస్తే అక్రమ కేసులా : రెడ్యం

ఖాజీపేట, ఏప్రిల్‌23: ప్రభుత్వం అక్రమాలు అవినీతిని ప్రశ్నించినందుకే మాజీ ఎమ్మెల్యే, సంగం డైరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రపై అక్ర మ కేసు నమోదు చేసి అరెస్టు చేయడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. దుంపలగట్టులోని స్వగృహంలో ఆయన మాట్లాడుతూ సంఘం డైరి సమస్య సుప్రీం కోర్టులో పెండింగ్‌లో వుందన్నారు.

రాజకీయ జీవితం లో మచ్చలేని ధూళిపాళ్లపై అవినీతి మోపి ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్టు చేయడం వైసీపీ ప్రభుత్వ పిరికిపంద చర్యకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. దశాబ్దాలుగా స్థానిక రైతుల భాగస్వామ్యంతో నడిచే సంఘం డైరీని నిర్వీర్యం చేసి గుజరాత్‌కు చెందిన అమూల్‌కి కట్టుబెట్టేందుకే అక్రమ అరెస్టులన్నారు. ప్రశ్నించిన వారందరినీ అరెస్టు చేసుకుంటూపోతే రాష్ట్రంలో ఎవరూ మిగలరన్నారు. 


Updated Date - 2021-04-24T04:21:32+05:30 IST