‘మట్టి అక్రమ తవ్వకాలను ఆపాలి’

ABN , First Publish Date - 2022-07-02T06:51:09+05:30 IST

తిరుమలగిరి మండలం మామిడాల గ్రామంలోని ఎర్రబోడు నుంచి మట్టి తవ్వకాలను ఆపాలని ఆ గ్రామ రైతులు లింగయ్య, ప్రేమ్‌కుమార్‌, రాజు కోరారు.

‘మట్టి అక్రమ తవ్వకాలను  ఆపాలి’

తిరుమలగిరి రూరల్‌, జూలై 1: తిరుమలగిరి మండలం మామిడాల గ్రామంలోని ఎర్రబోడు నుంచి మట్టి తవ్వకాలను ఆపాలని ఆ గ్రామ రైతులు లింగయ్య, ప్రేమ్‌కుమార్‌, రాజు కోరారు. శుక్రవారం ఆ గ్రామంలో మట్టి తోలు తున్న టిప్పర్లను రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నిత్యం వందలాది టిప్పర్ల ద్వారా మట్టిని వెంచర్లకు తరలిస్తున్నారన్నారు.  మట్టితవ్వాకాలను అధికారులు ఆపాలని, లేనట్లయితే  ఆందోళన చేస్తామని హెచ్చరించారు. టిప్పర్లను ఆపిన వారిలో  రైతులు లింగయ్య,ప్రేమ్‌కుమార్‌, రాజు, దామోదర్‌, శేఖర్‌రెడ్డి, సోమయ్య తదితరులు ఉన్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా మట్టితవ్వకాలకు ఎలాంటి అనుమతి లేదన్నారు.


Updated Date - 2022-07-02T06:51:09+05:30 IST