అక్రమంగా మట్టి తరలింపు.. సర్పంచ్‌పై కేసు

ABN , First Publish Date - 2021-04-24T04:15:52+05:30 IST

అక్రమంగా మట్టి తరలింపు.. సర్పంచ్‌పై కేసు

అక్రమంగా మట్టి తరలింపు.. సర్పంచ్‌పై కేసు

నందిగామ: అప్పారెడ్డిగూడ చెరువు నుంచి సర్పంచ్‌ జేకే నర్సింలు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని రెవెన్యూ అధికారి సుధ ఉత్తర్వులు జారీ చేయడంతో వీఆర్‌ఏ క్రిష్ణయ్య ఫిర్యాదు మేరకు నందిగామ పోలీ్‌సస్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. సర్పంచ్‌ నర్సింలుతోపాటు అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాల డ్రైవర్లు నరేష్‌, మధులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ధనుంజయ తెలిపారు. అయితే గ్రామాభివృద్ధి కోసం మట్టిని తరలిస్తుంటే.. తనపై కొందరు కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని సర్పంచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.


Updated Date - 2021-04-24T04:15:52+05:30 IST