రూ.80 లక్షల అక్రమ మద్యం ధ్వంసం

ABN , First Publish Date - 2022-07-01T09:30:04+05:30 IST

రూ.80 లక్షల అక్రమ మద్యం ధ్వంసం

రూ.80 లక్షల అక్రమ మద్యం ధ్వంసం

ఏలూరు జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ మద్యాన్ని జిల్లా పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు గురువారం ధ్వంసం చేశారు. ఏలూరు సమీపంలోని ఆటోనగర్‌ రైల్వే క్వార్టర్స్‌ వద్ద ఉన్న మైదానంలో మద్యం సీసాలను గుట్టగా పోసి తొక్కించారు. జిల్లా పరిధిలోని ఏడు ఎస్‌ఈబీ సర్కిళ్ల పరిధిలో గతేడాది మార్చి వరకూ 1,083 అక్రమ మద్యం కేసులు నమోదయ్యాయి. 33,933 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీసు అధికారుల సమక్షంలో ధ్వంసం చేశారు. ఈ మొత్తం బాటిళ్ల విలువ దాదాపు రూ.80 లక్షల వరకూ ఉంటుందని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ తెలిపారు. మరో 70 వేల మద్యం బాటిల్స్‌ను త్వరలో ధ్వంసం చేయనున్నట్టు తెలిపారు.

- ఏలూరు కలెక్టరేట్‌

Updated Date - 2022-07-01T09:30:04+05:30 IST