శీతలపానీయం తాగి చిన్నారుల అస్వస్థత
ABN , First Publish Date - 2021-01-25T04:56:19+05:30 IST
శీతలపానీయం తాగి చిన్నారుల అస్వస్థత
రేగొండ, జనవరి 24 : శీతలపానీయం తాగి ముగ్గురు చిన్నారులు అస్వస్థత కు గురయ్యారు. ఈ సంఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గూడెప ల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రా మానికి చెందిన ముద్దమల్ల రాజనర్సు ఇంట్లో ఉన్న శీతలపానీయాన్ని అతడి కుమారుడు దిలీప్(10)తోపాటు మిత్రులు కోడూరి రామ్చరణ్(10), శివగణేష్ (8) కలిసి తాగారు. దీంతో చిన్నారులు వాంతులు చేసుకొని స్పృహతప్పి పడిపో యారు. దీంతో వీరిని వెంటనే పరకాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరి ఆరోగ్యం నిలకడగానే ఉందని తల్లిదండ్రులు తెలిపారు. శీతలపానీయం కాల పరిమితి ముగిసిందా.. లేదా ఇందులో ఆల్కా హాల్ కలిపారా..? అనే విష యం తెలియాల్సి ఉంది.