బాధితులకు సత్వర న్యాయం : ఎస్పీ

ABN , First Publish Date - 2021-07-24T05:06:27+05:30 IST

దిశా పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదులు చేస్తున్న మహిళలకు సత్వర న్యాయం చేస్తామని ఎస్పీ దీపిక పాటిల్‌ వెల్లడించారు.

బాధితులకు సత్వర న్యాయం : ఎస్పీ
రికార్డులు పరిశీలస్తున్న ఎస్పీ

విజయనగరం క్రైమ్‌, జూలై 23: దిశా పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదులు చేస్తున్న మహిళలకు సత్వర న్యాయం చేస్తామని  ఎస్పీ దీపిక పాటిల్‌ వెల్లడించారు. శుక్రవారం దిశా పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మట్లాడుతూ..  ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులపై మర్యాదగా ప్రవర్తించాలని సూచిం చారు. దిశా యాప్‌పై మరింత అవగాహన కల్పించాలన్నారు.  అనం తరం   రికార్డులు, పెండింగ్‌ కేసులు , పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు.  డీఎస్పీ టి.త్రినాథ్‌, సిబ్బంది పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-07-24T05:06:27+05:30 IST