ముంబైలో ఘనంగా కొనసాగుతున్న నిమజ్జనోత్సవం

ABN , First Publish Date - 2021-09-12T16:19:26+05:30 IST

మహారాష్ట్రలోని ముంబైలో గణేష్ విగ్రహ నిమజ్జనం...

ముంబైలో ఘనంగా కొనసాగుతున్న నిమజ్జనోత్సవం

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో గణేష్ విగ్రహ నిమజ్జనం ఘనంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ మొత్తం 6,116 విగ్రహాలను సరస్సులలో, ఇతర కృత్రిమ రిజర్వాయర్లలో నిమజ్జనం చేశారు. నిమజ్జనోత్సవం గురించి ఒక అధికారి సమాచారమిస్తూ... 55 విగ్రహాలను బహిరంగ ప్రదేశాలలో, 6047 విగ్రహాలను ఇళ్లలో  నిమజ్జనం చేశారన్నారు. అలాగే 3600 వినాయక విగ్రహాలను కృత్రిమ సరస్సులలో నిమజ్జనం చేసినట్లు ఆయన చెప్పారు. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ సారధ్యంలో నిమజ్జన ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన ఆంక్షల మధ్య ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.

Updated Date - 2021-09-12T16:19:26+05:30 IST